ఏపీలో ఇక ఉపాధ్యాయుల హాజరు.. నిబంధనలు కఠినతరం
టీచర్లు బడులకు ఉదయం 9 గంటల తరువాత వస్తే ఆలస్యంగా (లేట్ ఇన్)
10 నిమిషాల వెసులుబాటు సమయం (గ్రేస్ పీరియడ్) నెలలో ఒకట్రెండు రోజులు మాత్రమేనన్న విద్యాశాఖ
ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం పాఠశాలకు వచ్చేవారు, ఒంటి గంట లోపు రావాలని, ఆ తర్వాత హాజరు నమోదు చేస్తే లేట్ ఇన్
ఉదయం పాఠశాలకు హాజరై, మధ్యాహ్నం సెలవు పెట్టినవారు, 12.30 గంటల కంటే ముందుగా ఔట్ టైం నమోదు చేస్తే వేగంగా వెళ్లిపోయినట్లు అని పేర్కొన్న విద్యా శాఖ
ప్రాథమిక పాఠశాలల్లో సాయంత్రం 3.30 గంటల కంటే ఒక నిమిషం ముందు, ఉప ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం 4 గంటల కంటే ఒక్క నిమిషం ముందు ఔట్ టైం నమోదు చేసినా అది ఏర్లీ ఔట్గా పరిగణిస్తామని వెల్లడి
ఎవరైనా ఉదయం ఇన్టైం నమోదు చేసి, ఔట్ టైం నమోదు చేయకపోతే.. ఉదయం హాజరు నమోదు చేసిన వెంటనే పాఠశాల ప్రాంగణాన్ని విడిచి వెళ్లి పోయినట్లుగా పరిగణన చేస్తామని ఉత్తర్వులు విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ..
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి