శావల్యాపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది
కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు ,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారు, పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు ,ఈ వారం జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం బిజెపి మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, మండలంలోని పిచికలపాలెం గ్రామంలో నిర్వహించడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా, గ్రామస్తులు రక్షిత మంచినీటి పథకం గత మూడు సంవత్సరాలుగా మరుగును పడిపోయిందని దాన్ని పునరుద్ధరించాలని అందులో భాగంగా జేజేఎం స్కీం మంజూరు చేయాలని అలాగే గ్రామంలో నుండి శావల్యాపురం వెళ్ళేటటువంటి రహదారిలో రాకపోకలకు కొంకేరువాగుపై ఎటువంటి నిర్మాణం లేనందున బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ,అలాగే మరొక రెండు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది మొత్తం నాలుగు దరఖాస్తులు వచ్చాయి వీటి యొక్క పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పి గ్రామస్తులకు దరఖాస్తుదారులకు తెలిపాము
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి