ఎమ్మెల్యేలు పాఠశాలలను విజిట్ చేయండి....
విద్యాశాఖ మంత్రి లోకేష్
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టవద్దని మిత్రులు వారించినా, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ సవాలును ఇష్టపూర్వకంగా స్వీకరించానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో మండలానికి రెండు పాఠశాలలను దత్తత తీసుకుని, విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక పాఠశాల వెయ్యి మంది విద్యార్థులతో కళకళలాడాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యేలు ప్రతివారం ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, అక్కడి వసతులు, హాజరుపై ఫీడ్బ్యాక్ ఇస్తే వెంటనే లోపాలను సరిదిద్దుతామని భరోసా ఇచ్చారు. విద్యావ్యవస్థ బలోపేతం అనేది కేవలం మంత్రి లేదా అధికారుల బాధ్యత మాత్రమే కాదని, అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే రాబోయే దశాబ్దాలకు అవసరమైన గొప్ప సంస్కరణలు తీసుకురాగలమని లోకేష్ వివరించారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి