నేటి నుంచి పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు
నేటి నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా 'సాయుధ పోలీసు బలగాల బిల్లు-2026'ను నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సిబ్బంది నియామకాలు, పదోన్నతులు, ఐపీఎస్ అధికారుల డిప్యుటేషన్ వంటి అంశాలను క్రమబద్దీకరించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశ్యం. ఇక శ్రీరామనవమి సందర్భంగా మార్చి 26న పార్లమెంటుకు సెలవు ప్రకటించారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి