శావల్యాపురం మండలంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ దిశా నిర్దేశం మేరకు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు, పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండల సీనియర్ నాయకులు అడుసుమల్లి వీరేంద్ర గారు, ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు, వినుకొండ నియోజకవర్గం మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు, ఈ వారం జనతా వారధి కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిధిలోని ముండ్రువారిపాలెం గ్రామంలో స్థానిక బిజెపి నేత గుంజా వెంకటేశ్వర్లు నిర్వహణలో చేయడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు గ్రామీణ రక్షిత మంచినీటి పథకానికి సంబంధించి శుద్ధి చేసిన నీరు సరఫరా కొరకై ,అలాగే గ్రామంలోని సైడ్ డ్రైనేజ్ పూర్తిస్థాయిలో పూడిక పూడికతీత కొరకై ,అలాగే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు కొరకై, సైడ్ డ్రైనేజీలు నిర్మాణం కొరకై, నూతన సిసి రోడ్లు ఏర్పాటు కొరకై వంటి అంశాలపై 5 దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఈ సమస్యల పరిష్కారం కొరకు బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి