(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ - మల్లెలన్యూస్ పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    23, మార్చి 2026, సోమవారం

    పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్




    పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్

     పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్లా గారికి రాష్ట్రంలో ప్రధాన సమస్య అయిన సంచార జాతుల కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం క్రోసూరు మండలంలో ప్రధాన సమస్య అయినటువంటి మరుగుదొడ్లు మరియు పంట కాలవల మెయింటినెన్స్ గురించి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారు పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మరియు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు క్రోసూరు మండల బీజేపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

    గౌరవనీయులైన శ్రీమతి కృతిక శుక్ల 
    జిల్లా కలెక్టర్ & జిల్లా మెజిస్ట్రేట్,
    పల్నాడు జిల్లా 

    విషయం: రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల (DNTs) వారికి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి కల్పించవలెనని వినతి.

    అమ్మ..

    భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, రాష్ట్రంలోని సంచార, అర్ధ సంచార మరియు డీనోటిఫైడ్ తెగల (DNTs) వారిని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా గుర్తించకపోవడం, కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు వీరికి అందకపోవడం దురదృష్టకరం.

    కేంద్ర ప్రభుత్వం నియమించిన జాతీయ డీనోటిఫైడ్, నామాడిక్ & సెమీ-నామాడిక్ తెగల కమిషన్ సిఫార్సులు మరియు దేశవ్యాప్తంగా ఈ తెగలు ఎదుర్కొంటున్న సమస్యలు (ముఖ్యంగా కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయడంలో ఆలస్యం) దృష్టిలో ఉంచుకుని, ఈ విషయం తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

    కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, ఈ తెగల వారిని గుర్తించి కుల ధృవీకరణ పత్రాలు జారీ చేసి, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలను వర్తింపజేయవలసిందిగా మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవపూర్వకంగా కోరుతున్నాం.

                            ఇట్లు
               ఏలూరి శశి కుమార్ 
                పల్నాడు జిల్లా అధ్యక్షులు
          భారతీయ జనతా పార్టీ
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా గారికి వినతి పత్రం సమర్పించిన పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top