(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు - మల్లెలన్యూస్ భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    8, మార్చి 2026, ఆదివారం

    భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు




    భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి అభినందనలు 

    టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అద్భుత విజయం సాధించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

    అహ్మదాబాద్‌లో భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా అద్భుతమైన ఆటతీరుతో విజయం సాధించింది. ఈ విజయం దేశ ప్రజలందరికీ గర్వకారణమని ముఖ్యమంత్రి గారు అన్నారు.

    మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు భారత జట్టు సమన్వయంతో, ధైర్యసాహసాలతో ఆడుతూ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిందని ప్రశంసించారు.
    బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ టీమ్ ఇండియా ఆటగాళ్లు ఆల్‌రౌండ్ ప్రతిభను ప్రదర్శించి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు.

    టీమ్ ఇండియా సాధించిన విజయం దేశ క్రీడా రంగానికి మరింత గౌరవం తెచ్చిందని అన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్‌తో పాటు టీమ్ సభ్యులందరికీ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: భారత క్రికెట్ జట్టుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top