(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం - మల్లెలన్యూస్ ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    27, మార్చి 2026, శుక్రవారం

    ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం




    ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం

    వాహనదారులకు పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఎలాంటి ఊరట లభించలేదు. 

    పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

     అయితే, ఈ తగ్గింపు ప్రయోజనం వినియోగదారులకు చేరదని, రిటైల్ ధరలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. 

    ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న భారీ నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

    ప్రస్తుత అంతర్జాతీయ ధరల ప్రకారం, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి సంస్థలు లీటర్ పెట్రోల్‌పై సుమారు రూ. 26, లీటర్ డీజిల్‌పై రూ. 81.90 చొప్పున నష్టపోతున్నాయి. 

    ఈ కంపెనీలు రోజుకు మొత్తంగా రూ. 2,400 కోట్ల నష్టాన్ని భరిస్తున్నాయని మంత్రిత్వ శాఖ వివరించింది. 

    తాజాగా తగ్గించిన రూ.10 ఎక్సైజ్ సుంకం ఈ నష్టాల్లో కొంత భాగాన్ని భర్తీ చేస్తుందని, దీనివల్ల సరఫరాకు అంతరాయం కలగకుండా చూసుకోవచ్చని పేర్కొంది.

    పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గత నెల రోజుల్లోనే అంతర్జాతీయంగా ముడి చమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు (దాదాపు 75 శాతం పెరుగుదల) పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. 

    ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంధన ధరలు 20 శాతం నుంచి 50 శాతం వరకు పెరిగినా, భారత్‌లో మాత్రం ధరలను స్థిరంగా ఉంచామని పేర్కొంది. 

    సామాన్య పౌరులను కాపాడేందుకే ప్రధాని మోదీ ప్రభుత్వ ఆదాయాన్ని వదులుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు.

    ఇదే సమయంలో, డీజిల్ ఎగుమతులపై ప్రభుత్వం కొత్తగా సుంకాన్ని విధించింది. 

    అంతర్జాతీయంగా ధరలు పెరిగిన నేపథ్యంలో, ఎగుమతులను నిరుత్సాహపరిచి, దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. 

    ప్రపంచ ఇంధన పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, వినియోగదారులకు సరఫరా, ధరల స్థిరత్వాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్రం హామీ ఇచ్చింది.
    Next
    This is the most recent post.
    పాత పోస్ట్
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top