మెదక్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించిన 20వ వార్షికోత్సవ సామూహిక బోనాల మహోత్సవానికి ముఖ్య అతిథిగా వంగవీటి ఆశా కిరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు శ్రీ మాతా నల్లపోచమ్మ దేవాలయం ను సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులతో కలిసి బోనాల ఉత్సవంలో పాల్గొని సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కార్యక్రమాన్ని మరింత ఘనంగా తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమంలో కొండా దేవయ్య, లక్ష్మణ్ పటేల్, రజనీకాంత్, రాయలసేన ఈశ్వర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
బోనాల మహోత్సవం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ వేడుక మున్నూరు కాపు సంఘ ఐక్యతను, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా జరిగింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి