(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై ప్రభుత్వ జీవోను అమలు చేయాలి – DROకి జర్నలిస్టుల వినతి. - మల్లెలన్యూస్ జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై ప్రభుత్వ జీవోను అమలు చేయాలి – DROకి జర్నలిస్టుల వినతి. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    4, జూన్ 2025, బుధవారం

    జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై ప్రభుత్వ జీవోను అమలు చేయాలి – DROకి జర్నలిస్టుల వినతి.

     






    జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై ప్రభుత్వ జీవోను అమలు చేయాలి – DROకి జర్నలిస్టుల వినతి. 


     గుంటూరు జిల్లాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు సమాజానికి, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి — నిస్వార్థంగా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాడ్‌కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ (APBJA) పేర్కొన్నాయి. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఉచిత విద్యను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా జీఓ జారీ చేసినప్పటికీ, దాన్ని జిల్లాలో పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ సంబంధిత అధికారులు కొన్ని సూచనలు, ఆదేశాలు జారీ చేసినప్పటికీ, చాలా ప్రైవేట్ విద్యా సంస్థలు వాటిని పాటించకపోవడంతో జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ అంశంపై గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం లో

    రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి (DRO)కి వినతిపత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రభుత్వం ప్రకటించిన ఉచిత విద్య హక్కు అందుబాటులోకి రావడానికి జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  జర్నలిస్టులు పట్నాల సాయి కుమార్, బోస్క సువర్ణ బాబు, శామ్యూల్, పుల్లారావు, శివ, సువర్ణ రాజు, తదితరులు పాల్గొన్నారు.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యపై ప్రభుత్వ జీవోను అమలు చేయాలి – DROకి జర్నలిస్టుల వినతి. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top