యోగాతోనే ఆరోగ్య భారత్ ఆరోగ్యాంధ్రఅదే మోడీ, చంద్రబాబు లక్ష్యం
యోగాంధ్ర కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జి సియ్యారి దొన్ను దొరగారు
ఆరోగ్య భారత్ - ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా భారత్ ప్రధాన మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు పని చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర గారు పేర్కొన్నారు. ఈనెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా అరకలోయలో మంగళవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యోగాసనాలు పూర్తయిన తర్వాత దొన్ను దొరగారు మీడియాతో మాట్లాడారు. యోగ నిత్యజీవితంలో ఒక భాగం కావాలని ఆయన పేర్కొన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతోనే ఆరోగ్య భారత్ - ఆరోగ్యాంధ్ర నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అందుకే ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు సంయుక్తంగా యోగాపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారన్నారు. అందరి జీవితంలో యోగా ఒక నిత్యం భాగం కావాలని ఆయన కోరారు. యోగాతోనే హెల్త్ అండ్ వెల్త్ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. యోగా ఎంత త్వరగా ప్రజలకు చేరువ చేస్తే అంత త్వరగా భారత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్లో రెండు కోట్ల మందికి యోగాను అనుసంధానం చేయాలని లక్ష్యంతో ప్రతిచోట యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యంతోనే పనులలో వృద్ధిని సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని దొన్ను దొరగారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెదలబుడు సర్పంచ్ పెట్టెలి దాసు బాబు గారు, టిడిపి అరకువేలి మండలాధ్యక్షుడు లోకోయ్ మహదేవ్ గారు, టిడిపి డుంబ్రిగూడ మండలాధ్యక్షులు ఆనంద్ గారు, గుంటసీమ మాజీ సర్పంచ్ గెన్ను టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి