కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తి
- ప్రజాతీర్పును గౌరవించుకున్న రోజు ఇది..- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి
-
అమరావతి: ప్రజా తీర్పునకు, ప్రజా చైతన్యానికి ఏడాది పూర్తయింది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి ఏడాది పూర్తయిందని..జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాదైందని ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అన్నారు. జూన్ నెల నాల్గో తేదీ 2024 అనేది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు. ఐదేళ్ళ ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోటలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజుగా అంటూ సోషల్ మీడియా 'ఎక్స్' లో జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోస్టు చేశారు. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న నవ భారత్ నిర్మాత నరేంద్ర మోదీ దృఢమైన నాయకత్వంలో, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్ఫూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలంటే జనసేన పార్టీ సంకల్పానికి ప్రజలకు అండగా నిలిచి చరిత్రాత్మక విజయాన్ని అందించిన రోజుగా వివరించారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నామని, గత తప్పిదాలను సరిచేస్తూ, భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించాలనే దిశగా అడుగులేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించడానికి, వికసిత్ భారత్ 2047 లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా "జనసేన పార్టీ - తెలుగుదేశం - బీజేపీ" పార్టీల ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుందన్నారు. "రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందజేస్తుంది, సంక్షేమం సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేయాలనుకుంటున్నాను. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన జనసైనికులకు, వీరమహిళలకు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు, మూడు పార్టీల నాయకులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా.." అంటూ పవన్ కళ్యాణ్ వివరించారు.
ఆనందాల కలయిక:
సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఏడాది సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని బుధవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపి ఆనందాన్ని పంచుకున్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి