మృతుల సంఖ్య గురించి ఇప్పుడే చెప్పలేం: డీకే శివ కుమార్
RCB విజయోత్సవాల్లో విషాద ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నగర పోలీస్ కమిషనర్తో మాట్లాడాను. ఈ ఘటనలో ఎంతమంది చనిపోయారో ఇప్పుడే చెప్పలేం. లక్షలాది మంది అభిమానులు వచ్చారు. పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అన్నారు. ఈ తొక్కిసలాట ఘటనలో 11మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి