-
సాక్షి స్టాఫ్ రిపోర్టర్ భూక్యా సునీల్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు
ములుగు మండలం కోడిశాల కుంట గ్రామానికి చెందిన ములుగు జిల్లా సాక్షి స్టాఫ్ రిపోర్టర్ భూక్యా సునీల్ హఠాన్మరణం మమ్ముల ఎంతో కలిచి వేసింది అని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు
మృదు స్వభావం కలిగిన వ్యక్తి అందరితో ఆప్యాయంగా ఉంటూ తన వృత్తికి వన్నె తెస్తూ ప్రజల సమస్యల ను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి మరోపక్క నా దృష్టికి తీసుకువచ్చే వాడాని ఆయన అకాల మరణం మమ్ముల ఎంతో కలిచివేసింది
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మళ్లీ మునపటి లాగా అందరిలో కలిసి తిరుగుతూ ఇలా అనుకోకుండా మరణించడం బాధాకరమని
ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా పత్రిక ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లడం లో ముందు వరుసలో ఉండే వాడని భూక్యా సునీల్ మరణం పత్రిక రంగానికి మాకు తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని సంతాపం వ్యక్తం చేసిన రాష్ట్ర మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు
వారి కుటుంబానికి పార్టీ తరుపున ప్రభుత్వం తరపున అండగా ఉంటామని
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి