రూ. 10.11 కోట్ల విలువైన గంజాయి, డ్రగ్స్ దహనం
సంగారెడ్డి జిల్లాలోని నాలుగు ఎక్సైజ్ స్టేషన్లలో 27 కేసుల్లో స్వాధీనం చేసుకున్న 209.162 కేజీల గంజాయి, 7 గ్రాముల డైజోఫామ్, 0.496 కేజీల ఆల్పోజోలం, 0.468 కేజీల పప్పి స్ట్రా, 90.23 కేజీల 3 ఎంఎంసీని మంగళవారం దహనం చేశారు. మెదక్ డిప్యూటీ కమిషనర్ జె. హరి కిషన్ ఆదేశాల మేరకు, ఎక్సైజ్ సూపరిండెంట్ నవీన్ చందర్ అధ్వర్యంలో ఇస్నాపూర్లో దహనం జరిగింది. విలువ రూ. 10.11 కోట్లుగా అంచనా.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి