రేవంత్ రెడ్డి మా లాంటి వాళ్ళను కాపాడలేడు.. నేను చనిపోతున్నాను
ఆర్ఆర్ఆర్లో తన 20 గుంటల భూమిని కోల్పోయి నష్ట పరిహారం అందక.. బతుకు దెరువు కోసం ఆటో నడుపుకుంటే ఫ్రీ బస్సు వల్ల ఆటో నడవక పురుగులమందు తాగిన రైతు
కేసీఆర్ సారు మాలాంటి రైతులకు న్యాయం చేయడం మీ వల్లే అవుతుంది అంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి ఆర్ఆర్ఆర్లో తన 20 గుంటల భూమిని కోల్పోయి ఏళ్ల తరబడి నష్ట పరిహారం అందక.. దీనికి తోడు తనకున్న మూడెకరాల సీలింగ్ భూమిని ఇతరులు కబ్జా చేశారని శివంపేట మండల తహశీల్దార్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో, అప్పులు తీర్చే మార్గంలేక, మనస్తాపం చెందిన శివంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కంచన్ పల్లి శేఖర్ తన పొలం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమించడంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
చికిత్స పొందుతున్న విషయం తెలుసుకుని బాధితుని పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించిన బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే సునితారెడ్డి
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి