త్రివిధ దళాలకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాల ప్రదానం
త్రివిధ దళాలకు 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలను ప్రదానం చేశారు. బుధవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 30 మంది అధికారులకు పరమ విశిష్ట సేవా పతకాలు, ఐదుగురికి ఉత్తమ యుద్ధ సేవా పతకాలు, 57 మందికి అతి విశిష్ట సేవా పతకాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. పరమ విశిష్ట సేవా పతకం, నౌ సేనా మెడల్ పొందిన వారిలో ఏపీలోని తెనాలికి చెందిన వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ వెన్నం ఉన్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి