కార్యకర్తల కుటుంబాలకు అండగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు
హైదరాబాద్ - కూకట్ పల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణలో ప్రమాదవశాత్తు మరణించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంకు చెందిన కేతావత్ హరి సింగ్ , మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బొప్పల జమున, నల్గొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గకు చెందిన కుర్ర సైదులు జనసైనికుల కుటుంబాలకు జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ , ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, కావ్య మండపాక, ఆర్కే సాగర్ గారి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి 5 లక్షల చొప్పున బీమా చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా శ్రీ శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుల కుటుంబాలకు ఆసరా ఉండాలన్న ఆలోచనతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకువచ్చిన ఈ బీమా సౌకర్యం ఎంతోమంది జనసేనకుల కుటుంబాలకు భరోసాను కల్పిస్తుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు యడమ రాజేష్ ,కొల్లా శంకర్ , సరి కొప్పుల నాగేశ్వరరావు, జమ్మన్న, రవీందర్ చవాన్, సాంబశివుడు, మహబూబ్, శ్రీను ఇతర నియోజకవర్గ నాయకులు మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి