శర్మిష్ఠ అరెస్టు బెంగాల్కు అవమానం – దీదీపై బీజేపీ ఘాటు విమర్శలు
న్యాయ విద్యార్థి శర్మిష్ఠ పనోలీను పోలీసులు అరెస్టు చేయడంపై బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఈ అక్రమ అరెస్ట్ ను తప్పుపడుతూ… పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసమే ఆమెను అరెస్టు చేశారని ఆరోపించారు.
‘‘శర్మిష్ఠను అరెస్టు చేయడం సిగ్గుచేటు. రాష్ట్రానికి అవమానకరం. బెంగాల్లో ఉత్తమ పాలన కొనసాగడం లేదు. రాజకీయ పగలు మాత్రమే కనిపిస్తున్నాయి.
నిర్మమత (దయలేని) దీదీ ప్రభుత్వం చేసిన ఈ చర్య రాజ్యాంగాన్ని హత్య చేయడమే. ఈ అధికార దుర్వినియోగాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది.
అధికార పార్టీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరిస్తోంది. సందేశ్ ఖాలిలో మాత్రం హైకోర్టు మందలించే వరకు నిందితుడిని అరెస్టు చేయలేదు.
ముర్షిదాబాద్ హింసలో నిందితులను రక్షించేందుకు వారంతా పని చేశారు’’ అని బీజేపీ నేత గౌరవ్ భాటియా ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి