నీట్-పీజీ 2025'ను ఆగస్టు 3న నిర్వహిస్తాం సుప్రీంకోర్టు అనుమతి కోరిన ఎన్బీఈ
న్యూ డిల్లీ : దేశవ్యాప్తంగా ఒకే షిఫ్ట్లో నీట్-పీజీ 2025ను నిర్వహించాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో జూన్ 15న నిర్వహించదలచిన ఈ పరీక్షను వాయిదా వేయాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్బీఈ) నిర్ణయించింది. ఒకే షిఫ్ట్లో సుమారు 2.43 లక్షల మంది విద్యార్థులకు పరీక్ష నిర్వహించాలంటే కేంద్రాల సంఖ్యతో పాటు ఇతర మౌలిక సదుపాయాలనూ భారీగా పెంచాల్సి ఉంటుం దని ఎన్బీఈ పేర్కొంది. ఇందుకుగాను మరింత సమయం కావాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. పరీక్ష నిర్వహణకు సాంకేతిక భాగస్వామిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) ఆగస్టు 3వ తేదీని సూచించిందని, ఎన్బీఈ వివరిం చింది. రోజున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించలగమని సుప్రీంకోర్టుకు విన్నవించింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి