ఏపీలో 4 కొత్త ఎయిర్ పోర్టులు: చంద్రబాబు
అమరావతి :ఏపీలో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. 2026 నాటికి 4 పోర్టులు, 4 హార్బర్లను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పోర్టులు, హార్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దేలా నిర్మించాలని ఆయన సూచించారు. అటు PPP విధానంలో రద్దీ ఉండే రోడ్లను ప్రాధాన్యత క్రమంలో విస్తరిస్తామని తెలిపారు. నేషనల్ హైవేలతో రాష్ట్ర రహదారులను అనుసంధానం చేస్తామని చెప్పారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి