వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ
మాజీ మంత్రివర్యులు ఆచంట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు గారి ఆదేశాల మేరకు పోడూరు మండలం
తూర్పు పాలెం వైయస్సార్సీపి పార్టీ కార్యాలయంలో వెన్నుపోటు దినం పోస్టర్ ను ఆవిష్కరించిన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు,
అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ
జూన్ 4న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం కావస్తున్నందున ప్రజలకు ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చకపోవడంతో తీవ్రంగా ఖండిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారి పిలుపుమేరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం చంద్రబాబు గారు చేసిన మోసాన్ని నిరసిస్తూ జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు,
బాదుడే బాదుడు అంటూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన సీఎం చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై బాదుడే బాదుడు నినాదం తో రాష్ట్రం లో పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం గడిచిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోగా దళితులు మైనారిటీలపై పోలీసుల సహాయంతో అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు గురి చేస్తున్నారని ఆరోపించారు,
జగన్ గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఇంటింటికి డోరు డెలివరీ రేషన్ పధకాన్ని నిలిపివేసి ఇప్పుడు కొత్త రేషన్ షాపులను ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసం ప్రశ్నించారు,
టిడిపి ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం మానేసి ప్యాకేజీ దండుకోవడం లో ముందున్నారని విమర్శించారు,
ఆచంట నియోజకవర్గంలో జరుగుతున్న అరాచక పాలనకు చమర గీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు,
జూన్ 4వ తారీఖున జరిగే వెన్నుపోటు దినం కార్యక్రమానికి విద్యార్థులు రైతులు కార్మికులు మహిళలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు,
ఈ పోస్టర్ ఆవిష్కరణ లో పోడూరు జడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు
జిల్లా ప్రధాన కార్యదర్శి దంపబోయిన బాబురావు,
ఆచంట మండల సర్పంచ్ ఛాంబర్ అధ్యక్షులు సుంకర సీతారామ్, గూడూరు దేవేంద్రుడు, చిన్నం బాబిరెడ్డి, సర్పంచ్ లు బోడపాటి బుల్లియ్య, కోట వెంకటేశ్వరరావు,వైసీపీ నాయకులు కర్రి వేణుబాబు, పిల్లి రుద్ర ప్రసాద్,పోతుమూడు రామచంద్రరావు, పలివెల శ్రీను, సాక సుబ్రహ్మణ్యం, సూర్య రెడ్డి, జక్కం శెట్టి చంటి, నంబూరి రాజా, కుచ్చర్లపాటి పద్మనాభ రాజు, భూపతి రాజు శ్రీనివాసరాజు, పోడూరి రామయ్య, దొంగ దుర్గాప్రసాద్, భవాని ప్రసాదు, జక్కం శెట్టి శ్రీరాములు, మేడిచర్ల పండు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి