మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు పై కీలక అప్డేట్
క్వార్జ్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ కస్టడీ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు ముగిశాయి.
కస్టడీ పిటిషన్, అలాగే బెయిల్ పిటిషన్పై ఈనెల 5న (గురువారం) న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది.
కాకాణిని కస్టడీలోకి తీసుకుంటే కేసులో పూర్తి వివరాలు తెలుస్తాయని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ తెలిపారు. కేసులో ముద్దాయిలు ఇచ్చిన సమాచారం మేరకు కాకాణిని(Ex Minister Kakani) కస్టడీకి తీసుకుంటే లోతైన సమాచారం సేకరించవచ్చన్నారు.
కోర్టులో ఇరుపక్షాల వాదనలు న్యాయమూర్తి విన్నారని… పోలీస్ కస్టడీకి ఇస్తారన్న నమ్మకం ఉందని డీఎస్పీ శ్రీనివాస్ చెప్పారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి