గంజాయి బ్యాచ్ కు మాజీ సీఎం మద్దతివ్వడం బాధాకరం
గంజాయి బ్యాచ్కు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుభూతి పలకడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు.
అరాచకాలు చేసినవారికి జగన్(YS Jagan) మద్దతివ్వడం దారుణమని చెప్పారు. డాక్టర్ సుధాకర్ను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.
తనకు ఓటేయని ప్రజలపై వైసీపీ వెన్నుపోటు దినోత్సవం చేస్తోందని ధ్వజమెత్తారు.
ఇవాళ(మంగళవారం) అమరావతిలో రఘురామ పర్యటించారు.
హెల్త్ కార్డ్ కోసం కొంతమంది నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చి మరి తెల్లరేషన్ కార్డు తీసుకుంటున్నారని.. అలా చేయొద్దని రఘురామకృష్ణంరాజు కోరారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి