పబ్లిక్ రోడ్డు ని ప్రవేట్ పార్కింగ్ గా వినియోగించడం ద్వారా ప్రజలకు తీవ్ర ఇక్కట్లు
"ప్రజాపక్షం" న్యాయ పోరాట సంస్థ వ్యవస్థాపకఅధ్యక్షులు తాటికొండ నరసింహారావు
పబ్లిక్ రోడ్డును వ్యాపారులు తమ సొంత పార్కింగ్ ప్లేస్ లాగా వినియోగించుకోవడం
గుంటూరు స్థానిక జిటి రోడ్డు నందు గల హోటల్ మమత ఆర్ఎస్ బ్రదర్స్ ముందు ఉన్నటువంటి పబ్లిక్ రోడ్డును వ్యాపారులు తమ సొంత పార్కింగ్ ప్లేస్ లాగా వినియోగించుకోవడం ద్వారా ప్రజలు రాకపోకలకు అనేక ఇక్కట్లు గురవుతున్నారని ట్రాఫిక్ ఉన్నతాధికారులు మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పబ్లిక్ రోడ్డును ప్రజలు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించవలసిందిగా ప్రజాపక్షం న్యాయపోరాట సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ నరసింహారావు పేర్కొన్నారు.
ఆర్ఎస్ బ్రదర్స్ ముందు హోటల్ మమత ముందు
ఉన్నటువంటి పబ్లిక్ రోడ్డుని పూర్తిస్థాయిలో వారి వారి పార్కింగ్కు ఉపయోగించడం వలన టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ ప్రజలు రాకపోకలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అనేక పర్యాయాలు ప్రభుత్వ అధికారులకు తెలియజేసినప్పటికీ పాత్కాలికమైన చర్యలు తీసుకుంటున్నారే తప్ప పరిష్కారం చూపటం లేదని నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు.
పబ్లిక్ రోడ్డుని పార్కింగ్ కి ఉపయోగించడం వలన గత ఒకటిన్నర సంవత్సరాల నుండి ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం
అని అన్నారు.
నూతనంగా నిర్మించే భవనాలకు కూడా పార్కింగ్ ప్లేస్ వదలకుండా నియమ నిబంధనలు పాటించకుండా మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా ప్లాన్ అప్రూవల్ చేస్తున్నారో కూడా తెలియచేయవలసిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.
పోలీస్ ట్రాఫిక్ ఉన్నతాధికారులుగుంటూరు నగర పాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలని నరసింహారావు డిమాండ్ చేశారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి