(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది - వెలంపల్లి - మల్లెలన్యూస్ కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది - వెలంపల్లి - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    1, జూన్ 2025, ఆదివారం

    కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది - వెలంపల్లి

     







    కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది - వెలంపల్లి


     రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది - వెలంపల్లి


     వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించిన వెలంపల్లి


     వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి - వెలంపల్లి


     ప్రజలను కూడా భాగ్యస్వామ్యం చేద్దాం - వెలంపల్లి


     కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం - వెలంపల్లి


    * కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన ఒక పెన్షన్ తప్ప ఏ సంక్షేమ పథకం పేద ప్రజలకు అందలేదు - వెలంపల్లి


    * కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి - వెలంపల్లి


    * ఏడాది కాలంలో లక్ష 50 వేల కోట్ల అప్పు చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి మేలు చేసింది - వెలంపల్లి


    * ప్రజలను చాలా చక్కగా మోసం చేసే ఘనుడు చంద్రబాబు నాయుడు - వెలంపల్లి


    * కరెంట్ బిల్లులు గాని,పెట్రోల్,డీజిల్ గాని నిత్యవసర సరుకులు ధరలు ప్రజలపై బాదుడే బాదుడు - వెలంపల్లి


    వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు జూన్ 4న తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆదివారం నాడు  స్థానిక భవానిపురంలోని వైసిపి నాయకులు కొనకళ్ళ విద్యదరరావు నివాసం నందు  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యులు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించి అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు.


    ఈ సందర్బంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జూన్ 4వ తేదీన చేపట్టనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జయప్రదం చేయాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం స్థానిక 40 డివిజన్లో గల బ్యాంక్ సెంటర్ వద్ద వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వద్ద నుండి నిరసన ర్యాలీ ప్రారంభమై ఎమ్మార్వో ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన గా వెళ్లి ఎమ్మార్వో గారికి వినతి పత్రం ఇస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజలను కూడా భాగ్యస్వామ్యం చేయాలని పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి స్థానిక ప్రజలను ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు గడిచిన దినమే జూన్ 4 వెన్నుపోటు దినమని దుయబట్టరు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన ఒక పెన్షన్ తప్ప ఏ సంక్షేమ పథకం పేద ప్రజలకు అందలేదన్నారు. కరోనా కష్టకాలంలో కూడా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన దేశంలోనే ఏకైక  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ఈ ఏడాది కాలంలో అమ్మఒడి ఇవ్వాలి, రైతు భరోసా ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, ఇటువంటి సంక్షేమ పథకాలన్నీ ఇవ్వకుండా ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో 1 లక్ష 50 వేల కోట్ల అప్పు చేసిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏమి మేలు చేసింది అని ప్రశ్నించారు. ప్రజలను చాలా చక్కగా మోసం చేసే ఘనుడు చంద్రబాబు నాయుడు అని దుయ్యబట్టారు. ప్రజల్ని మోసం చేసేటువంటి కూటమి ప్రభుత్వం యొక్క మెడలను వంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తిరుగుబాటు తప్పదు అన్నారు. కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందన్నారు. కరెంట్ బిల్లులు గాని, పెట్రోల్, డీజిల్ గాని నిత్యవసర సరుకులు గాని ప్రజలపై బాదుడే బాదుడు అనేటువంటి విధంగా ధరలమూత ఉందన్నారు. ప్రజలు గానీ వ్యాపారస్తులు గాని కుటుంబ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందన్నారు. రెడ్ బుక్కు రాజ్యాంగం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్టుల పేరుతో హింసిస్తూ శునకా ఆనందం పొందుతుందన్నారు. రానున్న రోజుల్లో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు తగిన మూల్యం చెల్లించుకొక తప్పదన్నారు.


    ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్లు బండి పుణ్యశిల, మండేపూడి చటర్జీ, యరడ్ల ఆంజనేయరెడ్డి, పడిగపాటి చైతన్య రెడ్డి, బాపతి కోటి రెడ్డి, యలకల చలపతిరావు, పార్టీ డివిజన్ ఇంచార్జ్ లు తంగెళ్ల రామచంద్రరావు, నాయకులు కర్నాటి రాంబాబు, మనోజ్ కొఠారి,గౌస్ మొహిద్దీన్,షేక్ హయత్, గోదావరి బాబు, దాసి జయప్రకాష్ కెన్నడీ,  మాజీ డైరెక్టర్లు,రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షులు మరియు నాయకులు తోలేటి శ్రీకాంత్,బొందిలి నరేంద్ర సింగ్, బూదాల శ్రీనివాసరావు,కేసరి కృష్ణ రెడ్డి,బాజీ బాబా,నజీర్, దొడ్డా రాజశేఖర్ రెడ్డి,అబ్దుల్ ఘని చిచ్చా,జిల్లా పార్టీ మరియు అనుబంధ విభాగ నాయకులు సయ్యద్ అతీక్,కేసరి సుబ్బా రెడ్డి చిన్నోడు,మజ్జి శ్రీనివాసరావు,వీరజల లీల మధు, పొదిలి చంటి,పదిలం రాజశేఖర్,షేక్ మస్తాన్,తనబుద్ది చంద్రశేఖర్ రెడ్డి,మెట్టు వెంకట రెడ్డి,నియోజకవర్గ స్థాయి పార్టీ మరియు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు,క్లస్టర్ ఇంచార్జ్లు వాసా ఆదినారాయణ బాబు,ఐతా కిశోర్, మాజి డైరెక్టర్ లు దేరంగుల రమణ, శీరం వెంకట రావు, కూరాకుల నాగ, హాబిబుల్లా, పార్టీ నాయకులు డివి రెడ్డి, పెద్ది సత్య సాయి బాబు, శరగడ శంకర్ రెడ్డి, వెన్నం రజని, పిళ్ల సూరిబాబు జగ్గు, తుపాకుల గురుమూర్తి రెడ్డి, గురుమాహంతు మహేష్, బొమ్ము మధు, గ్రంధి రమేష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కూటమి ప్రభుత్వానికి పతనం ప్రారంభమైంది - వెలంపల్లి Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top