ఆపరేషన్ సింధూర్పై పొలిటికల్ వార్.. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్!
ఆపరేషన్ సింధూర్లో భారత్దే పూర్తి పైచేయి అని కేంద్రం చెబుతుంటే .. రాహుల్గాంధీ మాత్రం ప్రధాని మోదీ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. ట్రంప్ ఫోన్కాల్కు భయపడి పాకిస్తాన్తో మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని అన్నారు.
రాహుల్ పాక్ ఐఎస్ఐ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రం వెంటనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి కాల్పుల విరమణపై వివరణ ఇవ్వాలని ఇండి కూటమి నేతలు డిమాండ్ చేశారు.
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ISIకి ప్రతినిధిలా రాహుల్ మాట్లాడుతున్నారని విమర్శించింది. ఆపరేషన్ సింధూర్పై కావాలనే దేశప్రజలను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి