ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంగవీటి మోహన రంగా విగ్రహాల ధ్వంసం కార్యక్రమం లో పాల్గొన్న దుష్ట మూకలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతీయ అధ్యక్షులు మల్లెల శివనాగేశ్వరరావు
పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహానికి సంబంధించిన చేతులు తీసివేయటం జరిగింది. చేతులు తీసివేసిన దుష్ట మూకలను వారు ఎంతటి పలుకుబడి ఉన్న వారైనా సరే వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇటువంటి అప్రజ స్వామిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు జాతి అధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు. ఈ మధ్యకాలంలో సఖినేపల్లి మండలం అంతర్వేది గ్రామంలో వంగవీటి మోహన రంగా విగ్రహ స్థాపనకు పర్మిషన్ లేదంటూ హడావుడి చేసి విగ్రహాన్ని పెట్టకుండా ఇబ్బందులు పాలు చేసిన చర్యలను కూడా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి