(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); 24 కేసులున్న చంద్రబాబును నడిరోడ్డుపై పోలీసులు కొట్టొచ్చా? తెనాలిలో వైఎస్ జగన్ సూటిప్రశ్న - మల్లెలన్యూస్ 24 కేసులున్న చంద్రబాబును నడిరోడ్డుపై పోలీసులు కొట్టొచ్చా? తెనాలిలో వైఎస్ జగన్ సూటిప్రశ్న - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    3, జూన్ 2025, మంగళవారం

    24 కేసులున్న చంద్రబాబును నడిరోడ్డుపై పోలీసులు కొట్టొచ్చా? తెనాలిలో వైఎస్ జగన్ సూటిప్రశ్న

     




    24 కేసులున్న చంద్రబాబును నడిరోడ్డుపై పోలీసులు కొట్టొచ్చా? తెనాలిలో వైఎస్ జగన్ సూటిప్రశ్న


    తెనాలి : రాష్ట్రంలో రెడ్‍బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఏపీ సీఎం చంద్రబాబు పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. నడిరోడ్డుపై యువకులను కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని సూటిగా ప్రశ్నించారు. మాజీ మంత్రులు, కార్యకర్తలపై రెడ్ బుక్ పాలనతో అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. 24 కేసులున్నాయని చంద్రబాబును సైతం నడిరోడ్డు మీదకు తీసుకొచ్చి కొట్టటం సబబేనా అని అన్నారు. తెనాలిలో ఇటీవల నడిరోడ్డు మీద పోలీసులు కొట్టడంతో గాయపడిన జాన్‌ విక్టర్‌ కుటుంబాన్ని వైఎస్ జగన్ మంగళవారం నాడు పరామర్శించారు. 


    కానిస్టేబుల్‌ను ప్రశ్నించడమే నేరమా..


    అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాకేష్, జాన్ విక్టర్, కరీముల్లా అనే ముగ్గురు దళితులు, మైనారిటీ వర్గాలకు చెందినవారు. రాకేష్ అనే యువకుడు తెనాలిలో ఉండడు. హైదరాబాద్ లో జొమాటోలో పనిచేస్తుండేవాడు. పాత కేసుకు సంబంధించి వాయిదా కోసం తెనాలికి రావడంతో చూసేందుకు వాళ్ల ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చారు.  జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్. అతడికి బార్ కౌన్సిల్లో సభ్యత్వం ఉంది. మరోవైపు కానిస్టేబుల్ యూనిఫామ్‍లో లేడు. అతడు  కానిస్టేబుల్ అన్న విషయం వీరికి తెలియదు. గొడవపడుతున్న కానిస్టేబుల్‍ను యువకులు నిలదీసి, ప్రశ్నించారు. కానిస్టేబుల్‌ను ప్రశ్నించడమే వీరు చేసిన తప్పా?. ఏప్రిల్ 24న యువకులు పోలీసులను క్వశ్చన్ చేశారు. మరుసటి రోజున పోలీసులు మంగళగిరికి వెళ్లి జాన్ విక్టర్, కరీముల్లాను కొట్టుకుంటూ తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా తెనాలి పీఎస్‍లో కూడా వారిని కొట్టారు. 


    ముగ్గురు యువకులు వేడుకుంటున్నా పోలీసులు వదల్లేదు


    ఏప్రిల్ 26న తెనాలిలోని ఐతానగర్‍లో రోడ్డుమీద పడేసి ముగ్గురిని పోలీసులు చితకబాదారు. కొట్టొద్దని వేడుకుంటున్నా వదలకుండా పోలీసులు వారిని కొట్టారు. యువకుల కుటుంబాల పరువు ప్రతిష్టలతో ఆడుకున్నారు. అందులో ఒక యువకుడికి ఆపరేషన్ చేసి కాలులో రాడ్డు వేశారు. కానీ రాడ్డు వేసిన ఆ కాలుపైనే పోలీసులు పాశవికంగా దాడిచేశారు. దాచేపల్లిలో హరికృష్ణపై సైతం తప్పుడు కేసు పెట్టారు పోలీసులు. ఈ విధంగా యువకులను నడిరోడ్డుపై కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు. తెనాలి టూటౌన్ సీఐ, మరో పీఎస్ సీఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి చట్టాన్ని ఉల్లంఘించారు.


    పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి ఇది నిదర్శనం..


    తప్పును ఒప్పుగా చేసేందుకు ప్రయత్నం చేస్తూ పోలీసులే తీర్పులు ఇచ్చేస్తున్నారు. పరువు ప్రతిష్టలు తీసే హక్కు పోలీసులకు లేనే లేదు. పోయిన ఆ కుటుంబాల పరువును ఎవరు తీసుకొస్తారు. పోలీస్ వ్యవస్థను చంద్రబాబు  దుర్వినియోగం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ అణగదొక్కుతున్నారు. రెడ్‍బుక్‍ రాజ్యాంగం అమలుతో అమాయకులను వేధించి హింసిస్తున్నారు. రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థ వికృత రూపానికి తెనాలి ఘటనే సాక్ష్యమని ప్రజలకు అర్థమైంది. నడిరోడ్డుపై పోలీసుల దాడిలో ముగ్గురు యువకులు గాయపడ్డారు. స్థానికంగా లేని యువకులు, వేరే ప్రాంతాల్లో పనిచేసుకుంటున్న యువకులను సైతం కూటమి ప్రభుత్వం, పోలీసులు విడిచిపెట్టడం లేదని’ వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: 24 కేసులున్న చంద్రబాబును నడిరోడ్డుపై పోలీసులు కొట్టొచ్చా? తెనాలిలో వైఎస్ జగన్ సూటిప్రశ్న Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top