జూన్ 20న 'రెవెన్యూ డే' గా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు
▪️ రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాట్లకు 52 లక్షలు నిధులు విడుదల.
ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని వెల్లడించింది. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, భూ వ్యవహారాలు, వివిధ ప్రయోజనాల కోసం అందించే ధ్రువీకరణ పత్రాలుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ తేదీన ఇప్పుడు ఏపీలో రెవెన్యూ డే ప్రకటించడం విశేషం.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి