తెలంగాణలో కరోనా.. అప్రమత్తమైన ప్రభుత్వం
తెలంగాణలో కరోనా.. అప్రమత్తమైన ప్రభుత్వం
తెలంగాణలో 4 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయితో పాటు జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీందర్ తెలిపారు. కరోనాను ఎదుర్కోవడంపై అన్ని జిల్లాల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కరోనా పాండమిక్ నుంచి ఎండమిక్ దశలో ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని చెప్పారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి