శర్మిష్ఠ పనోలీ అరెస్ట్ పై రాజకీయ దుమారం
ఎవరామె? ఎందుకు అరెస్టు చేశారు?
సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలీ అరెస్టు, 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఆపరేషన్ సింధూర్ పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో ఒకవర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన పూణె న్యాయ విశ్వవిద్యాలయం విద్యార్థిని శర్మిష్ఠ పనోలీకి కోల్కతా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది దీంతో ఆమెను జైలుకు తరలించారు పోలీసులు
శర్మిష్ఠ అరెస్టు వ్యవహారం దేశంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది
ఎవరీ శర్మిష్ఠ?
కోల్కతాలోని ఆనందపుర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల శర్మిష్ఠ పనోలీ పూణెలో న్యాయ విశ్వవిద్యాలయంలో నాలుగో సంవత్సరం చదువుతోంది
లింక్డిన్ ప్రొఫెల్ ప్రకారం.. ఆమెను ఇన్స్టాగ్రామ్లో 94 వేల మంది ఫాలోవర్లు అనుసరిస్తున్నారు
రాజకీయాలకు సంబంధించి తనదైన శైలిలో వ్యాఖ్యానాలు జోడించి తన అభిప్రాయాలను బలంగా చెప్పడం ద్వారా శర్మిష్ఠ పాపులర్గా మారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారింది
ఏం మాట్లాడింది?
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ శర్మిష్ఠ పనోలీ అనే యువతి మే 14న ఆమె పోస్టు చేసిన వీడియో తీవ్ర వివాదస్పదమైంది
భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ చేసిన వీడియోలో కొందరి మనోభావాలను కించపరిచారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై వ్యతిరేఖత మొదలైంది
ఈ వీడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి దీంతో ఆమె తన పోస్టులు, రీల్స్ను తొలగించి క్షమాపణలు చెప్పింది అయితే, శర్మిష్ఠను అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వచ్చిన క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు
పోలీసులు ఏం చెప్పారు?
ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన పోస్టు ద్వారా శర్మిష్ఠపై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కోల్కతా పోలీసులు
శర్మిష్ఠకు, ఆమె కుటుంబ సభ్యులకు లీగల్ నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదని, పైగా కుటుంబంతో కలిసి ఎక్కడికో వెళ్లిపోయారంటూ న్యాయస్థానానికి చెప్పారు ఫలితంగా కోల్కతా న్యాయస్థానం శర్మిష్ఠకు అరెస్టు వారెంట్ జారీ చేసింది దీంతో ఆమె గురుగ్రామ్లో ఉన్నట్టు ట్రాక్ చేసిన పోలీసులు, శుక్రవారం అక్కడికి వెళ్లి అరెస్టు చేసినట్లు వెల్లడించారు
అయితే, పోలీసులు ఇప్పటికే అన్ని డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నందున కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని శర్మిష్ఠ తరఫు న్యాయవాది చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది
మరోవైపు, కోల్కతా పోలీసులు తాము సరైన ప్రక్రియనే అనుసరించామని, కోర్టు వారెంటు ఆధారంగానే చట్టబద్ధంగానే ఆమెను అరెస్టు చేశామని చెప్పారు
రాజకీయ దుమారం:
మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ శర్మిష్ఠ పనోలీ అరెస్టు రాజకీయంగా దుమారం రేపుతోంది
ఆమె అరెస్టు ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్లో పోస్టు చేశారు
సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే.. టీఎంపీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు
దైవదూషణను ఎప్పుడూ ఖండించాల్సిందేనన్న ఆయన, సెక్యూలరిజం ఒకరికి రక్షణ కవచంగా, మరొకరికి కత్తిలా ఉండకూదన్నారు
బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తోందని ఎక్స్లో పోస్టు చేశారు
టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ, మంత్రి ఫిర్హాద్ అకీమ్, ఎంపీ మహువా మెుయిత్రి ఒక వర్గానికి చెందిన దేవుళ్లను కించపరిచినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పశ్చిమ్ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ప్రశ్నించారు
శ్రీ రామనవమి, హునుమాన్ జయంతి రోజున శోభయాత్రలపై రాళ్ల దాడి జరిగినప్పుడు పోలీసులు ఇంతే వేగంగా ఎందుకు స్పందించలేదని ఎక్స్లో పోస్టు చేశారు
శర్మిష్ఠకు న్యాయం చేసేందుకు సీనియర్ న్యాయవాదులు కృషి చేస్తున్నారని తెలిపారు
కోల్కతా పోలీసుల చర్య దేశంలోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉందని నెదర్లాండ్స్ పార్లమెంటు సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ ఎక్స్లో పోస్టు చేశారు
పాకిస్థాన్ గురించి నిజాలు మాట్లాడినందుకు ఆమెను శిక్షించవద్దని రాసుకొచ్చారు
ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్ఠకు సాయం చేయాలని ప్రధాని మోదీకీ గీర్ట్ వైల్డర్స్ విజ్ఞప్తి చేశారు
ఆల్ ఐస్ ఆన్ శర్మిష్ఠ అనే ఫొటోను కూడా పోస్టు చేశారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి