శ్రీవారి దర్శనానికి 16గంటల సమయం
తిరుమల :ఏపీ లోని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వదర్శనానికి 16గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వరుడి దర్శనానికి వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 78,631 మంది దర్శించుకోగా.. 31,247 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.29 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి