ఏలూరులో అత్యాధునిక హంగులతో నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగల పూడి అనిత ప్రారంభించారు.
▪️*ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కె ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు ప్రత్యేకంగా తయారు చేయబడిన షీ బాక్స్ను ప్రారంభించారు.*
▪️*మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని 30 సెంట్ల విస్తీర్ణంలో, ₹2.73 కోట్ల వ్యయంతో నిర్మించబడింది*.
- ఈ భవనంలో శిశు సంరక్షణ కేంద్రం, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మహిళా మరియు పురుష సిబ్బంది కోసం విడివిడిగా అత్యాధునిక బేరక్ లు ఉన్నాయి.
- విశాలమైన కాన్ఫరెన్స్ హాల్, సమావేశ మందిరాలు, సురక్షితమైన లాకప్ గదులు మరియు సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్ ఉన్నాయి.
- ఈ భవనంలో పూర్తి స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా నెట్వర్కింగ్ మరియు డిజిటల్ సదుపాయాలు ఉన్నాయి.
హోం మంత్రి వంగల పూడి అనిత మాట్లాడుతూ, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, వారికి స్నేహ పూర్వక వాతావరణం కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి