ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా ను ప్రభుత్వం నియమించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనిల్ చంద్ర పునేఠా ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
పునేఠా 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నారు.
2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.
2024లో కూటమి అధికారంలోకి వచ్చాక పునేఠా ను విజిలెన్స్ కమిషనర్ గా నియమించింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నీలం సాహ్ని ఐదేళ్ల పదవీకాలం గత నెల 31తో ముగిసిన నేపథ్యంలో.. ఎస్ఈసీగా పునేఠా ను నియమించారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి