నకిలీ ఆధార్తో బంగ్లాదేశీయులు.. 14 మంది అరెస్ట్
నకిలీ ఆధార్తో బంగ్లాదేశీయులు.. 14 మంది అరెస్ట్
పశ్చిమ బెంగాల్లోని జలపాయ్గురి జిల్లాలో నార్త్ఈస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న 14 మంది బంగ్లాదేశ్ పౌరులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి వద్ద ఉన్న ఆధార్ కార్డులు నకిలీవని నిర్ధారించారు. మలేషియా కరెన్సీ, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పని కోసం జమ్ము కశ్మీర్ వెళ్తున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు రైల్వే పోలీస్ అధికారి వెల్లడించారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి