(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); సాగర తీరంలో పరుగులు పెట్టనున్న మెట్రో.. పనులు వేగవంతం చేసిన ప్రభుత్వం - మల్లెలన్యూస్ సాగర తీరంలో పరుగులు పెట్టనున్న మెట్రో.. పనులు వేగవంతం చేసిన ప్రభుత్వం - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, మే 2025, శనివారం

    సాగర తీరంలో పరుగులు పెట్టనున్న మెట్రో.. పనులు వేగవంతం చేసిన ప్రభుత్వం





     

    సాగర తీరంలో పరుగులు పెట్టనున్న మెట్రో.. పనులు వేగవంతం చేసిన ప్రభుత్వం


    విశాఖ మెట్రో పనుల వేగవంతానికి కూటమి సర్కార్ చర్యలు

    జనరల్ కన్సల్టెన్సీ కోసం ఏఎంఆర్‌సీ బిడ్ల ఆహ్వానం

    అక్టోబర్‌లో శంకుస్థాపనకు ప్రభుత్వ సన్నాహాలు

    తొలి దశలో 46.23 కి.మీ., 42 స్టేషన్ల నిర్మాణం

    భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మెరుగైన కనెక్టివిటీపై దృష్టి

    సాగరనగరం విశాఖపట్నంలో మెట్రో రైలు కూతకు రంగం సిద్ధమవుతోంది.

     కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. నగరంలో పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు ఆధునిక రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

    విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) ఇటీవల జనరల్ కన్సల్టెన్సీ నియామకం కోసం బిడ్లను ఆహ్వానించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


    తొలిదశలో భాగంగా సుమారు రూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో 46.23 కిలోమీటర్ల మేర మూడు ప్రధాన కారిడార్లలో 42 స్టేషన్లను నిర్మించాలని ప్రతిపాదించారు.

    కారిడార్ 1: స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు (34.40 కి.మీ., 29 స్టేషన్లు)

    కారిడార్ 2: గురుద్వారా నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు (5.07 కి.మీ., 6 స్టేషన్లు)

    కారిడార్ 3: తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75 కి.మీ., 7 స్టేషన్లు)


    ఈ ప్రాజెక్టు కోసం సుమారు 98 ఎకరాల భూమి అవసరమని అధికారులు గుర్తించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. పలు సంస్థలు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ప్రాజెక్టుకు 100% నిధులు సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు.


    రాబోయే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో అనుసంధానం కల్పించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, దానికి అనుగుణంగా కనెక్టివిటీని మెరుగుపరచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇందుకోసం వీఎంఆర్‌డీఏ 15 కీలక రహదారులను గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: సాగర తీరంలో పరుగులు పెట్టనున్న మెట్రో.. పనులు వేగవంతం చేసిన ప్రభుత్వం Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top