*తల్లికి వందనం జీవో విడుదల..*
ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి పిల్లలను పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేలు సాయం అందిస్తామని పేర్కొంది. విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది. గత ప్రభుత్వంలో 'అమ్మఒడి'గా ఉన్న ఈ పథకాన్ని ఎన్డీయే సర్కారు 'తల్లికి వందనం' గా మార్చింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి