అమరావతి: పర్వతనేని ఫౌండేషన్, లుగాంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా మెడికల్ అంబులెన్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేశాయి. కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర 88వ జయంతి సందర్భంగా పర్వతనేని ఫౌండేషన్ తరఫున ఆయన తనయుడు పి.వివేక్ ఆనంద్.. సీఎం చంద్రబాబు చేతులమీదుగా అంబులెన్స్ను అందించారు. క్రిటికల్ కేర్ వైద్యంలో ఈ అంబులెన్స్ కీలకంగా పనిచేస్తుందని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వివేక్ను సీఎం చంద్రబాబు అభినందించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయంలో జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఉపేంద్రతో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి