(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); గుంటూరు జిల్లా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి ఇంట్లో 1.5 కోట్ల వెండి , బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది. - మల్లెలన్యూస్ గుంటూరు జిల్లా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి ఇంట్లో 1.5 కోట్ల వెండి , బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది. - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    24, జనవరి 2026, శనివారం

    గుంటూరు జిల్లా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి ఇంట్లో 1.5 కోట్ల వెండి , బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది.






    గుంటూరు జిల్లా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి  ఇంట్లో 1.5 కోట్ల వెండి , బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది.


    కూలీ చేసుకునే వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి, నగదు బయటపడటం కలకలం రేపింది. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జరిపిన సోదాల్లో 15 కిలోల వెండి, 800 గ్రాముల బంగారం, 5.65 లక్షల నగదు దొరికాయి. తన అల్లుడే వీటిని దాచుకున్నాడని వృద్ధురాలు చెప్పడంతో.. పోలీసులు అతని ఇంటికి వెళ్లారు.. కానీ అప్పటికే పారిపోయాడు.
     
    గుంటూరు జిల్లా తెనాలిలో రోజువారీ కూలి పనులు చేసుకునే ఒక వృద్ధురాలి ఇంట్లో కోటిన్నర విలువైన బంగారం, వెండి ఆభరణాలు, డబ్బులు బయటడ్డాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణం బాలాజీరావుపేట సమీపంలోని మహేంద్ర కాలనీలో పేరిబోయిన గురవమ్మ అనే వృద్ధురాలు ఒక చిన్న రేకుల ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె రోజువారీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే ఆమె ఇంట్లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌కు రైస్ పుల్లింగ్ జరుగుతోందన్న సమాచారం వచ్చింది. వెంటనే డీఎస్పీ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురవమ్మ ఇంట్లో సోదాలు చేశారు. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: గుంటూరు జిల్లా తెనాలి లో.కూలీ పనిచేసుకొనే వారి ఇంట్లో 1.5 కోట్ల వెండి , బంగారం , 5.65 లక్షల డబ్బు దొరికింది. Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top