*ది.29-5-2026 వ తేదిన పల్నాడు జిల్లా బిజెపి కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం నిర్వహించడం జరిగింది*
*ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 'జనతా వారధి' కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభించి 1 గంటలకు ముగింపు చేయడం జరిగింది. ఈ జనతా వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించడం జరిగింది*
*ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లెపు కృపారావు గారు పాల్గొని వినతి పత్రాలు స్వీకరించడం జరిగింది*
*పాల్గొన్న నాయకులు:*
*ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు శ్రీ వల్లెపు కృపారావు గారు జాతీయ కౌన్సిల్ సభ్యులు పల్నాడు జిల్లా జనతా వారది కన్వీనర్ మల్లెల శివనాగేశ్వరరావు గారు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్చార్జి కోమటి వాసు మరియు బిజెపి నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*
*కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ కౌన్సిల్ మెంబర్ వల్లెపు కృపారావు గారి చేతుల మీదుగా జనతా వారధికి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది*
*ఈ కార్యక్రమంలో అర్జీదారులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బిజెపి లక్ష్యమని, 'జనతా వారధి' ద్వారా ప్రతి సామాన్యుడికి పార్టీ అండగా ఉంటుందని ముఖ్యఅతిథిగా పాల్గొన్న వల్లెపు కృపారావు గారు తెలిపారు*
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి