హైదరాబాద్: మాజీ మంత్రి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది.
వివేకానందరెడ్డి కుమార్తె దాఖలు చేసిన తదుపరి దర్యాప్తు (ఫర్దర్ ఇన్వెస్టిగేషన్) పిటిషన్పై నిందితుల తరఫు న్యాయవాదులు తమ కౌంటర్ను సమర్పించారు.
ఇప్పటికే కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తయిందని, ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మరింత దర్యాప్తు అవసరం లేదని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
అయితే, గతంలో సీబీఐ సమగ్రంగా దర్యాప్తు నిర్వహించలేదని, దాఖలైన ఛార్జ్షీట్ను పరిగణనలోకి తీసుకోరాదని సునీత తరఫు న్యాయవాది వాదించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి