రొయ్యలను తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు:
తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి రొయ్యలంటే బాగా ఇష్టం ఉంటుంది. తెలుగు వారికి రొయ్యలంటే ప్రాణం.
సెలీనియం
రొయ్యల్లో సెలీనియం బాగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
మతిమరుపు
చాలా మంది మతిమరుపుతో బాధపడుతుంటారు. అలాంటి వారు రొయ్యలు తింటే మంచిది. మతిమరుపు ఈజీగా పోతుంది. వీటిని తింటే క్యాల్షియం కూడా బాడీకి బాగా అందుతుంది.
చర్మం నిగనిగలాడుతుంది
రొయ్యల్లో విటమిన్ ఈ కూడా అధికంగా ఉంటుంది. వీటిని తింటే చర్మం నిగనిగలాడిపోతుంది. కాంతివంతంగా మారుతుంది. అలాగే రొయ్యల్లో విటమిన్ బీ12 కూడా బాగా ఉంటుంది. దీంతో రక్తనాళాలు శుభ్రపడతాయి.
వెయిట్ లాస్ కావాలనుకునేవారు
కొందరు పచ్చి రొయ్యల్ని తింటూ ఉంటారు. దీంతో పోషకాలు డైరెక్ట్ గా బాడీకి అందుతాయి. వెయిట్ లాస్ కావాలనుకునేవారు రొయ్యల్ని తరుచూ తింటూ ఉండండి.
రొయ్యల్ని టేస్ట్ చేస్తూ ఉండండి
రొయ్యల్లో మెగ్నీషియం కూడా బాగానే ఉంటుంది. దీంతో కండరాలు బలపడతాయి. ఇలా చాలా ఉపయోగాలు రొయ్యల వల్ల ఉన్నాయి. బాడీకి కావాల్సిన ప్రతి ప్రోటీన్ రొయ్యల ద్వారా లభిస్తుంది. అందుకే అప్పుడప్పుడు రొయ్యల్ని టేస్ట్ చేస్తూ ఉండండి. రోజూ పప్పు అన్నమే తింటే బాడీకి కావాల్సిన పోషకాలు అందవు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి