నేను అందుబాటులో లేను.. అసెంబ్లీ వాయిదా వేయాలి !
నేను అందుబాటులో లేను కాబట్టి ప్రభుత్వం నిర్వహిస్తోన్న అసెంబ్లీ సమావేశాలు వారం రోజులు వాయిదా వేయాలని ఎమ్మెల్యే రాజా సింగ్ కోరారు. ప్రస్తుతం తాను రాజస్థాన్, ఉత్తరా ఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నానని ఆయన అన్నారు. అయినా ఇంత సడెన్ గా అసెంబ్లీ సమావేశాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అని అయన ప్రశ్నించారు. గతంలో మునిసిపల్ ఆక్ట్ లో మీరే సవరణలు చేశారని, ఇప్పుడు మళ్ళీ చేస్తా అంటున్నారని ఆయన అన్నారు. మీ మీద మీకే నమ్మకం లేదా ? అని రాజా సింగ్ ప్రశ్నించారు. ఎంఐఎంకి లాభం చేకూర్చేందుకే ఈ సవరణలు అని తెలిసిందని రాజా సింగ్ ఎద్దేవా చేశారు.
బీజేపీకి ఉన్న సభ్యుడిని నేనొక్కణ్ణే కాబట్టి అన్ని పార్టీలకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అసెంబ్లీ పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఇక ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించే శాసనసభ, శాసనపరిషత్తు సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి , శాసన పరిషత్తు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలు పరిశీలించారు. సభలో సభ్యుల మద్య భౌతిక దూరం ఉండే విధంగా అమర్చిన సీటింగ్ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణం, సభ లోపల పూర్తి స్థాయిలో శానిటైజేషన్ చేయించాలని అధికారులకి ఆదేశాలు జారీ చేశారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి