రాష్ట్ర బిజెపి పార్టీ దిశ నిర్దేశం మేరకు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు శ్రీ ఏలూరి శశి కుమార్ గారు శావల్యాపురం మండలం సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు ఈపూరు మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ నియోజకవర్గ మాజీ కన్వీనర్ శ్రీ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు ఈ వారం జనతా వారధి కార్యక్రమాన్ని శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నిర్వహించడం జరిగింది, కార్యక్రమంలో భాగంగా ప్రజలు పలు సమస్యల్ని అర్జీలు రూపంలో ఇవ్వడం జరిగింది, గ్రామంలోని సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని అలాగే మనిషి చనిపోయింది తర్వాత ఆ మనిషిని కాల్చేందుకు కనీసం స్మశానం కూడా మా గ్రామానికి లేదని రోడ్లమీదనే శవాన్ని కాల్చేటువంటి పరిస్థితిలో ఉన్నామని గ్రామ పరిధిలో ప్రభుత్వ భూములు లేనందున ప్రభుత్వం వారు నిధులు మంజూరు చేసి స్మశానానికి స్థలాన్ని కేటాయించాలని, అలాగే ముటుకూరి పేరయ్య అనే రైతు తన పొలంలోకి వెళ్లేందుకు సరిహద్దు రైతు అడ్డంకులు సృష్టిస్తున్నారని కావున ప్రక్కనేప్రక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలోనుండి నా పొలంలోకి వెళ్లేందుకు రెవెన్యూరెవెన్యూ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని, అలాగే ఉపాధి హామీ పనులు కల్పించాలని అలాగే పొలాన్ని ఆన్లైన్ చేయించాలని కిసాన్ సమ్మన్ నిధి పథకం వర్తింపజేయాలని దరఖాస్తులు రావడం జరిగింది వీటి పరిష్కారం బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని దరఖాస్తుదారులకు తెలియజేయడం జరిగింది .
31, మే 2026, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి