అప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉండడంతో, రూ.3 లక్షలకు నాలుగో సంతానం విక్రయం
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తాండాలో ముగ్గురు ఆడపిల్లలతో కలిసి నివసిస్తున్న దేవీసింగ్, శిరీష దంపతులు
ఈ ఏడాది మార్చి నెలలో మెదక్ మాతా శిశు కేంద్రంలో శిరీష మరో ఆడబిడ్డకు జన్మనివ్వగా, పోషించే స్తోమత లేక బిడ్డను విక్రయించాలని నిర్ణయించుకున్న దంపతులు
మధ్యవర్తుల సహాయంతో రూ.3 లక్షలకు సిద్ధిపేట జిల్లా అల్లీనగర్ ప్రాంతానికి చెందిన సంతానం లేని కమలమ్మ, లింగయ్య దంపతులకు శిశువు విక్రయం
ప్రసవం అనంతరం తల్లి వద్ద బిడ్డ లేకపోవడం గమనించి ఐసీడీఎస్ అధికారికి సమాచారం ఇచ్చిన అంగన్వాడీ సిబ్బంది
తండాలో విచారించి శిశు విక్రయం జరిగిందని నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐసీడీఎస్ అధికారులు
దీంతో శిశువు తల్లి, మధ్యవర్తులు, కొనుగోలు చేసిన దంపతులతో సహా 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి