జనతా వారిది కార్యక్రమాన్ని శావల్యాపురం మండలంలోని భాస్కర్ నగర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో మంచినీటి పథకం కు మరమ్మత్తులు చేసి త్రాగునీరు సరఫరా చేయాలని, గ్రామం నుండి స్మశానానికి వెళ్లే రహదారి గోతులు మయంగా వర్షాకాలంలో బురదమయంగా మారిందని ఈ రహదారికి మరమ్మత్తులు చేయాలని, అలాగే గ్రామంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినటువంటి మాలపాటి లక్ష్మారెడ్డి అనే యువకుడికి వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తులు రావడం జరిగింది, వీటి పరిష్కారానికి బిజెపి పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని అర్జీదారులకు తెలియజేయడం జరిగింది, కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు సీనియర్ నాయకులు అన్నవరపు శ్రీనివాసరావు గ్రామస్తులు పాల్గొన్నారు.
10, మే 2026, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి