చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ఊహించని తిరుగుబాటు. టీవీకే (తమిళగ వెట్రి కజగం) అధినేత విజయ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలని గవర్నర్ను కోరినా, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆ అనుమతిని నిరాకరించారు.గవర్నర్ కార్యాలయం నుంచి వెలువడిన సమాచారం ప్రకారం:అసెంబ్లీలో మెజారిటీ (Magic Figure) కోసం 118 ఎమ్మెల్యేలు అవసరం.
టీవీకే ప్రస్తుతం కేవలం 112 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే చూపించగలిగింది.
మిగతా 6 మంది ఎమ్మెల్యేల మద్దతు విషయంలో విజయ్ ఇచ్చిన వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదు.
దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి