దుబాయ్లో చిక్కుకున్న పీవీ సింధు
దుబాయ్లో చిక్కుకున్న పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం ఇంగ్లాండ్ వెళ్తుండగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె ప్రయాణం ఆగిపోయింది. "తదుపరి నోటీసు వరకు అన్ని సర్వీసులను రద్దు చేశారు" అని సింధు సోషల్ మీడియాలో పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్ శనివారం ఇరాన్పై దాడి చేయడంతో గల్ఫ్ ప్రాంతంలో గగనతలాన్ని మూసివేయడంతో అనేక విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి