(adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-5006878789297145", enable_page_level_ads: true }); నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఫరూక్ - మల్లెలన్యూస్ నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఫరూక్ - మల్లెలన్యూస్

ప్రకటనలు


  • Latest News

    31, మే 2025, శనివారం

    నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఫరూక్






     

    నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఫరూక్


    నంద్యాల టౌన్ 10 వ వార్డు నశం వీధిలో బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గోవిందు నాయుడు ఆధ్వర్యంలో లబ్ధిదారుకు స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్ అందజేసిన రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు...


    ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు మాట్లాడుతూ పింఛన్ పంపిణీ చేసినప్పుడు లబ్ధిదారుల కళ్ళల్లో ఆనందం కనిపించిందని అన్నారు . 200 రూపాయలు ఉన్న పెన్షన్ వేయి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు గారికే దక్కిందని అన్నారు ... అదేవిధంగా 1000/- రూపాయలు ఉన్న పెన్షన్ 2000/- చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని అన్నారు గత ప్రభుత్వంలో 2000 ఉన్న పెన్షన్ ని 3000 పెంచుతూ ఐదు సంవత్సరాలు గడిపిన వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని ... ఏట 250/-రు పెంచుతూ ప్రజలను నమ్మకద్రోహం చేశారని ... టిడిపి అధికారం చేపట్టిన వెంటనే అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 3000/- రు పెన్షన్ ని 4000 పెంచుతూ అదేవిధంగా మూడు నెలల ముందే ప్రతి నెల 1000 రూపాయలు చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అలా ప్రతినెల 1వ తేదీనే పింఛన్ ఇవ్వడం జరుగుతుందని అలాగే ఒకటవ తేదీ ఆదివారం వస్తే 31వ తేదీనే వారికి పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు . రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపు జూన్ 1 వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే అంటే ఈరోజు 31 మే 2025 వ తేదీన నంద్యాల నశం వీధిలో పింఛన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు .అలాగే నంద్యాలలో అన్ని వార్డులలో , అన్ని గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి లబ్ధిదారులకు పింఛన్ అందజేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . అనంతరం పింఛన్ లబ్ధిదారులకు అల్పాహార విందును ఏర్పాటు చేయడం జరిగింది

    ఈ కార్యక్రమంలో నంద్యాల ఇంచార్జి కమిషనర్ వెంకట దాస్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్ , నంద్యాల టిడిపి పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్ , 19 వ వార్డు టిడిపి ఇంచార్జి షేక్ మున్నా , 15 వార్డ్ టీడీపీ సీనియర్ నాయకులు నాగేశ్వరరావు , మాజీ కౌన్సిలర్లు అజ్మీర్ , మిద్దె హుస్సేన్ , 10 వార్డ్ టీడీపీ నాయకులు ఫయాజ్ , ఆసిఫ్ , సమీయుల్లా , హుస్సేన్ వాలి , మాభాష , జాకీర్ మరియు మున్సిపల్ అధికారులు , సచివాలయ సిబ్బంది , టిడిపి నాయకులకు , కార్యకర్తలకు , అభిమానులకు , ప్రజలలు తదితరులు పాల్గొన్నారు

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: నంద్యాలలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన మంత్రి ఫరూక్ Rating: 5 Reviewed By: mallelanews
    Scroll to Top